రైల్వే ట్రాక్‌పై రీల్ చేస్తుండగా రైలు ఢీకొని ముగ్గురు మృతి..

by Disha Web Desk 6 |
రైల్వే ట్రాక్‌పై రీల్ చేస్తుండగా రైలు ఢీకొని ముగ్గురు మృతి..
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం జనాలు ఫోన్లకు బానిసలయ్యారు. ఫేమస్ కావడం కోపం రీల్స్ ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నారు. కొంత మంది సరదా కోసం వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో రీల్ చేయడానికి వెళ్లి ఇద్దరు పురుషులు ఓ మహిళ మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

ఘజియాబాద్‌లోని మసూరిలోని కల్లు గర్హి రైల్వే ట్రాక్ పై ఇద్దరు యువకులు ఓ మహిళ ముగ్గురు కలిసి రీల్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. మొరాదాబాద్‌లో వేగంగా వస్తున్న పద్మావత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. అది గమనించిన రైల్వే స్టేషన్ మాస్టర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటన బుధవారం అర్థరాత్రి కల్లుగర్హి గేట్, దాస్నా స్టేషన్ మధ్య జరిగినట్టు పోలీసులు తెలిపారు.

Also Read...

హీటర్‌తో ఉరివేసుకుని విద్యార్థి సూసైడ్

Next Story